సిరా న్యూస్,ఇంద్రకీలాద్రి;
బిజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు,ఎంపి దగ్గుబాటి పురందరేశ్వరి శుక్రవారం కుటుంబసభ్యులతో వచ్చి శ్రీ అమ్మవారి ఖడ్గమాలార్చన సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయ వేదపండితులు వేదాశీర్వచనం చేసి శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రము, చిత్రపటం అందజేసారు. తరువాత వీరు శ్రీ మల్లేశ్వర స్వామి వారి అభిషేకం సేవలో పాల్గొన్నారు.