సిరా న్యూస్, బోథ్
బడీడు పిల్లలను బడిలో చేర్పించండి: ప్రధానోపాధ్యాయులు ఆర్ మధు
ఐదు సంవత్సరాలు నిండిన పిల్లలందరిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా అంగన్వాడీ కార్యకర్తలు కృషి చేయాలని ప్రాథమిక పాఠశాల ప్రధానో పాధ్యాయులు ఆర్ మధు కోరారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ సోనాలలో విద్యార్థుల తల్లిదండ్రులు, అంగన్వాడీ కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల పనితీరును విద్యార్థులు తల్లిదండ్రులకు వివరించారు. ఉచిత పుస్తకాలతో పాటు డ్రెస్సులు, మధ్యాహ్న భోజనం అందివ్వడం జరుగుతుందన్నారు. ఉన్నత ప్రమాణాలతో విద్యా బోధన, అర్హత ఉపాధ్యాయులతో బోధించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు