సిరా న్యూస్,కడప;
తెలంగాణ ఆడ బిడ్డ అయిన షర్మిల తన స్థాయికి మించి మాట్లాడుతున్నారని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. వివేకానందరెడ్డి కోరిక మేరకే ఎంపీగా పోటీ చేస్తున్నాని చెబుతున్న షర్మిల రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన పార్టీకి మద్దతు ఇచ్చి నైతికంగా షర్మిల చనిపోయిందన్నారు. వివేకా కేసులో అవినాస్ రెడ్డిని దోషి చెప్పడానికి షర్మిలకు ఏం హక్కుందని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజల తీర్పు ప్రకారం అవినాస్ రెడ్డి గెలిస్తే ఆయనకు ఏ కేసుతో సంబంధం లేదని ఒప్పుకున్నట్లేనా అన్నారు. ప్రజా కోర్టులో అయినా , న్యాయస్థానాల్లో అయినా తీర్పుకు తాము కట్టుబడి ఉంటామన్నారు.