వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రధోత్సవం

సిరా న్యూస్,అవనిగడ్డ;
మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో మూడవరోజు శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి రధోత్సవం వైభవంగా ప్రారంభమైంది. స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడు రోజులుగా భక్తులతో పోటెత్తింది సుబ్రహ్మణ్య క్షేత్రం. మోపిదేవి పురవీధుల్లో అమ్మవార్లతో కలసి రథం పై గ్రామోత్సవంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారు ఊరేగారు. రధోత్సవాన్ని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు దంపతులు, డీఎస్పీ మురళీధర్, ఆలయ ఏసీ నల్లం సూర్య చక్రధరరావు ప్రారంభించారుర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *