కోదాడలో రఘువీర్ రెడ్డి మార్నింగ్ వాక్

ఎమ్మెల్యే పద్మావతితో కలిసి పలు ప్రాంతాల్లో వాకింగ్
 సిరా న్యూస్,కోదాడ;
కోదాడ పట్టణంలో నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే పద్మావతితో కలిసి మార్నింగ్ వాక్ చేశారు. ఉత్తమ్ పద్మావతి నగర్ లో ఆయన వాకర్స్ తో ముచ్చటించారు. బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో కుందూరు రఘువీర్ రెడ్డి స్థానికులతో కలిసి వాల్ బాల్ ఆడారు. రంగా థియేటర్ సమీపంలోని రోడ్డు పక్కన ఓ చాయ్ వాలాతో సరదాగా ముచ్చటించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కుందూరు రఘువీర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎంపీ అయ్యాక ఎమ్మెల్యే పద్మావతితో కలిసి కోదాడ మరింత అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తానన్నారు. నల్గొండలో తన విజయం పక్కా అని.. మెజార్టీపైనే తాము దృష్టి సారించామన్నారు. తమ కార్యకర్తల సహకారంతో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తానని కుందూరు రఘువీర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *