రిమాండ్ కి తరలింపు
సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి
సిరా న్యూస్,రాజన్న సిరిసిల్ల;
భూమి విషయంలో చీటింగ్ చేస్తూ, తప్పుడు కాగితాలు తయారు చేసి సంతకాలు ఫోర్జరీ చేసి, భూమి హద్దులు చూపకుండా రిజిస్ట్రేషన్ చేసి చంపుతానని బెదిరించిన సిరిసిల్ల కు చెందిన రాగుల రాములు పై సిరిసిల్ల టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించనట్లు డిఎస్పీ తెలిపారు.
ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ.
సిరిసిల్ల పట్టణం సంజీవయ్య నగర్ కి చెందిన రాగుల రాములు అనే వ్యక్తి గత 10 సంవత్సరాల, క్రితం పద్మనగర్ లోని సర్వే నంబరు 960/బి, లో 363 చదరపు గజాల భూమి ఉందని దాని జిరాక్స్ కాగితాలు ఎల్లారెడ్డిపేట్ కి చెందిన ఉప్పుల నారాయణ కు చూపించగా నారాయణ అట్టి భుమీ నిజంగానే ఉందని నమ్మి అట్టి భూమికి 3.00,000 ఇచ్చి కొనుక్కొని సిరిసిల్ల సబ్ రిజిష్త్రర్ కార్యలయం నందు రిజిస్ట్రేషన్ చేపించుకొన్న తర్వాత హద్దులు చూపించమంటే హద్దులు చూపకుండా తప్పించుకుంటు తిరుగుతుండగా, నారాయణ డాక్యుమెంట్ నంబరు 2875/2013 ప్రకారం నారాయణ తసీల్దార్ కార్యాలయములో చెక్ చేసుకోగా అట్టి భూమి ప్రభుత్వానికి చెందినదని ఉండగా నారాయణ రాగుల రాములు చేతిలో మోసపోయిన అని గ్రహించి సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా, రాగుల రాములు పై కేసు నమోదు చేసి ఎల్లారెడ్డిపేట్ కి చెందిన నారాయణను మోసం చేశాడని విచారణలో తెలువగా రాగుల రాములు ను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు తెలిపారు.
నిందితుడు అయిన రాగులు రాములు పై భూ కబ్జాలకు, చీటింగ్ లకు సంబంధించి గతములో సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో 20 కేసులు ఉన్నాయని రాగులు రాములు చేతిలో మోసపోయిన బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయాలని తెలిపారు.