Rahul Raj: ప్రత్యేక తరగతులు నిర్వహించాలి

సిరా న్యూస్, గుడిహత్నూర్
ప్రత్యేక తరగతులు నిర్వహించాలి
జిల్లా పాలనాధికారి రాహుల్ రాజ్
ప్రాథమికోన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ
ప్రత్యేక తరగతులు నిర్వహించి 10/10 ఉత్తీర్ణత సాధించేలా అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులను జిల్లా పాలనాధికారి రాహుల్ రాజ్ ఆదేశించారు. గుడిహత్నూర్ మండల కేంద్రంలోని ప్రాథమికోన్నత పాఠశాలను గురువారం జిల్లా పాలనాధికారి రాహుల్ రాజ్. ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల తరగతి గది కి వెళ్లి పరిశీలించారు. విద్యార్థులను పాఠ్యాంశాల పై అడిగి తెలుసుకున్నారు. బోధన పై విద్యార్థులతో అన్ని పాఠ్యాంశాల పై మంచి శ్రద్ధ వహించాల‌న్నారు.మధ్యాహ్న భోజనంపై విద్యార్థులను అడిగి తెలుసుకొని , వంటను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు .ఈ కార్యక్రమంలో తహసిల్దార్ కవితా రెడ్డి. ప్రధానోపాధ్యాయుడు దేవదాస్. ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *