సిరా న్యూస్, ఆదిలాబాద్
అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలి
* జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
జిల్లా నలుమూలల నుంచి వచ్చే ప్రజలు వారి సమస్యలపై అందించే అర్జీలను కాలయాపన చేయకుండా తక్షణమే పరిష్కరించి వారికి న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి దరఖాస్తులను జిల్లా పాలనాధికారి రాహుల్ రాజ్ వివిధ మండలాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన వివిధ మండలాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి 18 దరఖాస్తులు స్వీకరించి సంబంధిత అధికారులకు ఇస్తూ అర్జిదారుని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.
బీసీ వెల్ఫేర్,ఎంప్లాయ్ మెంట్, ఐటీడీఏ, మున్సిపాలిటీ, రెవెన్యూ సంబంధిత సమస్యలపై దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో శిక్షణ సహాయ కలెక్టర్ వికాస్ మొహతో , వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.