Rahul Raj: మార్చి 1 వరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు

సిరా న్యూస్, ఆదిలాబాద్‌
మార్చి 1 వరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు
* రేపు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో 2 కె రన్
* జిల్లా పాలనాధికారి రాహుల్ రాజ్
* వారోత్సవాల పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ‌
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆద్వర్యం లో మార్చి 1 వరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని జిల్లా పాలనాదికారి రాహుల్ రాజ్ అన్నారు. సోమ‌వారం ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో క‌లెక్ట‌రేట్‌లో ఏర్పాటు స‌మావేశంలో ఆయన మాట్లాడుతూ బ్యాంకులు, విద్యాసంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయని అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఉదయం 7.00 గంటలకు జిల్లా పాలనాధికారి ఆద్వర్యం లో 2 కె రన్ నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు, బ్యాంకర్లు అందరూ హాజరు కావాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ కే.భాస్కర ప్రసాద్ తెలిపారు. అలాగే 28 వ తేదీన ఉదయం 11.00 గంటలకు ఆర్థిక అక్షరాస్యత శిబిరం డిగ్రీ కళాశాలలో, మున్సిపల్ కార్యాలయం పక్కన, ఆదిలాబాద్ లో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అనంతరం జిల్లా పాలనాధికారి ఎల్‌డీఎం , ఇతర అధికారులతో కలిసి పోస్టర్, పుస్తకాలను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *