Raja Singh: కమలంపువ్వు గుర్తుకు ఓటువేసి నగేష్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలి: ఎమ్మెల్యే రాజాసింగ్

సిరాన్యూస్‌, ఖానాపూర్‌
కమలంపువ్వు గుర్తుకు ఓటువేసి నగేష్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలి: ఎమ్మెల్యే రాజాసింగ్
ఖానాపూర్ పట్టణంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రోడ్ షో
భారీగా తరలివచ్చిన బీజేపీ శ్రేణులు
* జై బీజేపీ, జై శ్రీరాం నినాదాలతో మార్మోగిన రహదారులు
* మా ఓటు బీజేపీకేనని ముక్తకంఠంతో తెలిపిన జనవాహిని

అదిలాబాద్ లోక్ సభ స్థానం మరోసారి బీజేపీ మయం చేసేందుకు కమలంపువ్వు గుర్తుకు ఓటువేసి గోడం నగేష్ ని భారీ మెజారిటీతో గెలిపించాల‌ని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం నుండి జరిగిన భారీ రోడ్ షో లో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు. నియోజకవర్గ నలుమూలల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి రోడ్ షోలలో పాల్గొన్నారు. రోడ్ షో లో జనాలనుద్దేశించి రాజాసింగ్ మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ హయంలో పొరగు దేశం నుండి దాడులు జరిగితే ప్రేమ లేఖలు రాసేవారని, ఇప్పుడు నరేంద్రమోదీ హయాంలో చిన్న దాడి జరిగిన మిస్సైల్స్ పొరగుదేశం పై విరుచుకుపడతున్నాయని, దెబ్బకు రెట్టింపు దెబ్బతో పొరుగు దేశాల వారు మన దేశంవైపు కన్నెత్తి చూడాలన్న వెన్నులో వనుకుపుట్టేలా అత్యున్నతమైన పరిపాలనను న‌రేంద్ర‌మోడీ అందిస్తున్నార‌ని తెలిపారు.నరేంద్రమోదీ ని మరోసారి ప్రధాని చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ ని భారీ మెజారిటీతో గెలిపించి ఢిల్లీకి పంపి నరేంద్రమోదీ కి బహుమతిగా అందివ్వాలని పిలుపునిచ్చారు. అనంత‌రం ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ మాట్లాడుతూ కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు చారిత్రక అవసరమని, దేశమే ప్రాణంగా, దేశ అభ్యున్నతే శ్వాసగా పాటుపడుతున్న నరేంద్రమోదీ ని మరోసారి ప్రధాని చేయడమే లక్ష్యంగా కమలంపువ్వు గుర్తుకు ఓటువేసి ఆశీర్వదించాలని కోరారు.అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ మాట్లాడుతూ అబ్ కీ బార్ చార్సో పార్ లో అదిలాబాద్ స్థానాన్ని భాగస్వామ్యం చేసేందుకు ఈనెల‌ 13 న ప్రతి ఒక్కరూ కమలంపువ్వు గుర్తుకు ఓటువేసి గోడం నగేష్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా పార్టీ బాధ్యులు, మండల కార్యవర్గ సభ్యులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *