RAJAIAH:కదన భేరి సభకు త‌ర‌లి రావాలి

సిరా న్యూస్, సైదాపూర్
కదన భేరి సభకు త‌ర‌లి రావాలి
* మండల అధ్యక్షులు సోమారపు రాజయ్య
కరీంనగర్ జిల్లాలోఎస్ఆర్ఆర్ కళాశాల(గౌరిశెట్టి వెంకటయ్య) మైదానంలో రేపు తలపెట్టిన భారత రాష్ట్ర సమితి కదన భేరి భారీ బహిరంగ సభకు కార్యకర్తలు,ప్రజలు,కదలి రావాలని భారత రాష్ట్ర సమితి సైదాపూర్ మండల అధ్యక్షులు సోమారపు రాజయ్య ,ప్రధాన కార్యదర్శి చెల్మల్ల రాజేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈసంద‌ర్బంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, కరీంనగర్ జిల్లా మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్, హుస్నాబాద్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్, భారత రాష్ట్ర సమితి హుస్నాబాద్ ఇంచార్జ్ లు ముఖ్య అతిథులు హాజరుకానున్నారు. ప్రజా ప్రతినిధులు, భారత రాష్ట్ర సమితి గ్రామ అధ్యక్షులు,భారత రాష్ట్ర సమితి సహనాయకులు, అనుబంధ సంఘాలు కార్యకర్తలు,రైతులు,మహిళలు యువకులు,విద్యార్థులు, అభిమానులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *