సిరాన్యూస్, ఆదిలాబాద్
ఆదిలాబాద్ నూతన కలెక్టర్గా రాజర్షి షా
తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగానే మెదక్ జిల్లా కలెక్టర్గా పని చేసిన రాజర్షి షా ఆదిలాబాద్ జిల్లాకు నూతన కలెక్టర్గా రానున్నారు. ఈమేరకు రాష్ర్ట ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది వరకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గా పని చేసిన రాహుల్ రాజ్ను రాష్ర్ట ప్రభుత్వం బదిలీ చేసిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్గా రాజర్షిషా బాధ్యతలు స్వీకరించననున్నారు.