Rajarshi Shah: విద్యార్ధుల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ద వహించాలి

సిరా న్యూస్, ఆదిలాబాద్‌
విద్యార్ధుల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ద వహించాలి
* జిల్లా పాలనాధికారి రాజర్షి షా
విద్యార్ధుల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ద వహించాలని జిల్లా పాలనాధికారి రాజర్షి షా అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఆశ్రమ పాఠశాలలు , గురుకులాల లోని విద్యార్థుల ఆరోగ్యం, త్రాగునీటి వసతి, బియ్యం, ఇతర ఆహార పదార్థాల నాణ్యత పై జిల్లాలోని అన్ని ఆశ్రమ పాఠశాలల , గురుకులాల ప్రధానోపాధ్యాయులు వసతి గృహ సంక్షేమ అధికారులతో జిల్లా పాలనాదికారి రాజర్షి షా, ఐటిడిఎ పిఓ ఖుష్బూ గుప్తా తో కలసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా క‌లెక్ట‌ర్ జిల్లాలో గల ఆన్ని ఐటిడిఎ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో గురుకుల పాఠశాలలో కావలసిన అవసరమైన మౌలిక సదుపాయాల పై. ప్రతి స్కూల్ కి సంబందించిన అధికారులను అడిగి తెలుసుకున్నారు. తాగునీటిని, మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేయాలని, ఆర్వో ప్లాంట్స్ రిపర్స్ ఉంటే వెంటనే మరమ్మతులు చేపట్టాలని, ఎక్కడా కూడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అలాగే విద్యార్ధుల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ద వహించి ఎప్పటికప్పుడు విద్యార్ధుల ఆరోగ్యం పై ఆరా తీయాలని, ప్రతీ గురువారం పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్స్ ఫీల్డ్ విసిట్ చేయాలని, అనారోగ్యం, ఎనీమియా తో బాధపడుతున్న వారిని గుర్తించి వైద్యం అందించాలని ఆన్నారు. ప్రతీ మొదటి గురువారం ఒక స్కూల్ పర్యటించి మినిమం విద్యార్థులను పరీక్షించి మిగిలిన విద్యార్థులను మరుసటి గురువారం పరీక్షించాలని తెలిపారు. షెడ్యూల్ తయారు చేసుకొని ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని ఆదేశించారు. అలాగే 5 పీహెచ్‌సీ లలో ఏర్పాటు చేసిన ఆరోగ్య మహిళా కేంద్రాలు ప్రతీ మంగళవారం క్యాంపులు నిర్వహించి ఆరోగ్య కార్డులు అందించాలని ఆన్నారు. అలాగే ఆహార విషయం లో ప్రత్యేక శ్రద్ద వహించి నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, సివిల్ సప్లై ద్వారా సరఫరా చేస్తున్న ఫ్యురిఫైడ్ బలవర్ధకమైన బియ్యాన్ని వృధా కాకుండా పదిహేను నిమిషాలు బియ్యం నానబెట్టడం వల్ల పైన తేలుతున్న బియ్యం కలసి పోతాయని దీనివల్ల మంచి పోషకాలు అందుతాయని అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా సివిల్ సప్లై శాఖ నుండి స్కూల్ లో శిక్షణ ఇవ్వాలని, ఇందులో అందరూ పాల్గొనేలా చూడాలనీ ఆన్నారు.ప్రతీ హాస్టల్ లో త్రాగునీరు, ఆరోగ్యం, ఆహార విషయం లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఆన్ని జాగ్రత్తలు పాటించాలని నాణ్యమైన సరుకులు అందించాలని తెలిపారు.పెండింగ్ పనులు మరమ్మత్తులు లాంటివి ఏమైన ఉంటె ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *