Rajarshi Shah: అనుమానాస్పద లావాదేవీలను గుర్తించాలి

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
అనుమానాస్పద లావాదేవీలను గుర్తించాలి
* జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా
అనుమానాస్పద లావాదేవీలను గుర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుదవారం జిల్లా పాలనాధికారి తన ఛాంబర్ లో జిల్లా ఎస్పీ గౌస్ ఆలం తో కలసి ఇంటెలిజెంట్, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు, బ్యాంకర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాభై వేల నుంచి పది లక్షల మధ్య డబ్బుల లావాదేవీలు జరిగితే కచ్చితంగా రసీదు ఉండాలని పేర్కొన్నారు. 10,లక్షల పైన లావాదేవీలు ఉంటే ఆదాయ పన్ను శాఖ పరిధిలోకి వెళ్తుందని చెప్పారు. జిల్లాలో ఏటీఎంల్లో డబ్బులు నింపేందుకు వచ్చే సెక్యూరిటీ వ్యాన్ లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అన్నారు. ఏజెన్సీలు పెద్ద మొత్తంలో డబ్బులు తరలించాలంటే తెలంగాణ సీఈఓ నుంచి అనుమతి తప్పనిసరిగా పొందాలని అన్నారు. లాకర్స్ లో గోల్డ్ ను పర్యవేక్షించి, క్యాష్ జెనరేట్ చేయడానికి క్యూఆర్ కోడ్ ను ఉపయోగించాలని, వెహికిల్ నంబర్ లను తనిఖీ చేయాలని వివరించారు. అలాగే ప్రతి రోజూ క్యాష్ డిపాజిట్ వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం సీజ్ చేసిన వాటిని ఎలక్షన్ సీజర్ మేనేజిమెంట్ సిస్టమ్ పోర్టల్లో నమోదు చేయాలని , ఎన్నికల పారదర్శకత నిర్వహణలో భాగంగా ఎన్నికల నిబంధనల మేరకు ఫ్లయింగ్ స్క్వాడ్ టీములు, స్టాటిస్టికల్ సర్వైలెన్స్ టీముల నిఘా, పర్యవేక్షణలో పట్టుకున్న డబ్బు, మద్యం, బంగారం, డ్రగ్స్ విలువైన వస్తువుల వివరాలను పోర్టల్ లో సకాలంలో నమోదు చేయాలని సూచించారు.ఎన్నికల నిర్వహణలో ఏ దశలోనూ లోపాలు లేకుండా, ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేర కుఎన్నికల విధులు చాలా కీలకమైనవని, ఎక్కడా ఏ చిన్న తప్పిదానికి తావివ్వకుండా వంద శాతం సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్, ఎస్ఎస్టి బృందాలను పూర్తి స్థాయిలో పనిచేసేలా చూడాలన్నారు నిఘా బృందాలు తమకు కేటాయించిన ప్రదేశాల్లో విధులు నిర్వహించాలని అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా కేటాయించిన బృందాలు ఏ ఏ ప్రదేశాల్లో ఏర్పాటు చేసింది అడిగి తెలుసుకున్నారు. ఏఆర్ఓ లు నిఘా బృందాల పర్యవేక్షణ చేయాలన్నారు. క్రిటికల్, వల్నరబుల్ పోలింగ్ కేంద్రాల గుర్తింపు పూర్తి చేయాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం లో సిసి కెమెరా ల ఏర్పాటు వందశాతం చేయాలని, పోలింగ్ కేంద్రాల వెలుపల సిసి కెమెరాల ఏర్పాటుచేయాలన్నారు. ఏఆర్ఓలు, పోలీస్ అధికారులు తమ పరిధిలోని ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి, మౌళిక సదుపాయాల పరంగా, భద్రతా పరంగా చేపట్టాల్సిన చర్యల గురించి కార్యాచరణ చేయాలన్నారు. సువిధ సింగిల్ విండో ద్వారా అనుమతులు జారిచేయాలని, నిర్ణీత కాలవ్యవధిలోగా అనుమతులు జారీ అయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. రవాణా కార్యాచరణ పకడ్బందీగా చేయాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఆయా సెగ్మెంట్ల పరిధిలోను, రిషిప్షన్ కేంద్రం ఒకేచోట కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించి, రిషిప్షన్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లు చూసుకోవాలన్నారు. ఎన్నికల పరిశీలకుల సందర్శన లోగా కౌంటింగ్ కేంద్రం ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. సి విజిల్ పై విస్తృత చేయాలన్నారు. యువతతో సమావేశాలు నిర్వహించి, సి-విజిల్ పై అవగాహన కల్పించాలన్నారు. 85 సంవత్సరాలు పైబడిన వారికి, దివ్యాoగులకు హోం ఓటింగ్ నిమిత్తం ఫారం -12డి లను ఇంటింటికి అందజేయాలన్నారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ చెక్‌పోస్ట్‌ ల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండాలని లోకసభ సాధారణ ఎన్నికల సందర్భంగా పటిష్ట నిఘా చర్యలు చేపట్టి విస్తృత తనీఖీలు నిర్వహించాలని, నగదు, మద్యం రవాణాను నియంత్రించాలని అన్నారు. పోలీసు సిబ్బంది విధులు నిర్వహణ, ఎన్ని వాహనాలు తనిఖీ చేసిన వివరాలతో కూడిన నివేదిక, రిజిస్టర్ ఏర్పాటు చేయాలని, ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని ప్రతి చెక్‌ పోస్ట్‌ లో వీడియోగ్రఫీ సరిగా చేయాలనీ, అప్రమత్తంగా వుంటూ, 24 గంటల పటిష్ట నిఘా పెట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్యామలాదేవి , ఏఎస్‌డీఎస్‌పీ జీవన్ రెడ్డి, ఎక్షైజ్, ఎల్డీఎం , బ్యాంకర్లు, ఎలక్షన్ సూపర్డెంట్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *