Rajarshi Shah: మొదటి విడుత ర్యాండమైజేషన్ పూర్తి

సిరాన్యూస్, ఆదిలాబాద్‌
మొదటి విడుత ర్యాండమైజేషన్ పూర్తి
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా
లోక్ సభ ఎన్నికలు 2024 పోలింగ్ సిబ్బంది మొదటి విడుత ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగ‌ళ‌వారం  ఆదిలాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఆధ్వ‌ర్యంలో కలెక్టర్ ఛాంబర్ లో ఎన్నికల సంఘం నిబంధనలననుసరిస్తూ లోక్ సభ ఎన్నికలు 2024 పోలింగ్ సిబ్బంది మొదటి విడత ర్యాండమైజెషన్ ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులను, ఇతర పోలింగ్ అధికారులు, 768 .పోలింగ్ కేంద్రాలకు సంబంధించి మొత్తం 4385  మందిని మొదటి విడత ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించడం జరిగిందని అన్నారు. అందులో 2240మంది ప్రిసైడింగ్, సహయ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర అధికారులు 2145, ప్రతి టీములో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, ఇద్దరు ఇతర పోలింగ్ ఆఫీసర్లు ఉంటారన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, డీపీఆర్ ఓ తిరుమల, ఏఓ అరవింద్, ఈడీఎం రవీందర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *