సిరా న్యూస్, ఆదిలాబాద్
నామినేషన్ ప్రక్రియ పై అవగాహన ఉండాలి : కలెక్టర్ రాజర్షి షా
* నామినేషన్ ప్రక్రియపై తహసీల్దార్లతో సమీక్ష
త్వరలో జరగనున్న పార్లమెంటరీ ఎన్నికల సందర్భంగా నామినేషన్ ప్రక్రియ పై సహాయ రిటర్నింగ్ అధికారి బోథ్ ఖుష్బు గుప్తా, తహశీల్దార్ లకు పూర్తి స్థాయి లో అవగాహన ఉండాలని ఆదిలాబాద్ జిల్లా రిటర్నింగ్ ఎన్నికల అధికారి, జిల్లా పాలనాధికారి రాజర్షి షా అన్నారు. సోమవారం తన ఛాంబర్ లో జిల్లా తహసీల్దార్ల కు నామినేషన్ ప్రక్రియ పై ట్రైనీ కలెక్టర్ వికాస్ మహతో కలిసి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఈనెల 18 వ తేదీ నుండి లోక్ సభ ఎన్నికల నామినేషన్ ల స్వీకరణ కు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఫిబ్రవరి 28 న వెలువడిన గైడ్ లైన్ ప్రకారం పాటించాలని, అభ్యర్థులు ఈనెల 18 వ తేదీ నుండి 25 వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియోగ్రఫీ చేయాలని, అభ్యర్థులు సమర్పించే అఫిడవిట్ లో ఎలాంటి బ్లాంక్ లు లేకుండా చూసుకోవాలని, చెక్ లిస్ట్ ప్రకారం నామినేషన్ ఫారం అభ్యర్థులు సమర్పించేలా చూడాలన్నారు. నామినేషన్ స్క్రూటినీ రిటర్నింగ్ అధికారి మాత్రమే చేయాల్సి ఉంటుందన్నారు. 26 వ తేదీన నామినేషన్ లను పరిశీలించడం, 29 వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు ఉంటుందని, మే 13న పోలింగ్ , కౌంటింగ్ జూన్ 4 న జరుగుతుందని తెలిపారు. అధికారులు పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని, ఈ నెల 15 వ తేదీ వరకు ఆన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎలక్టోరల్ కు సంబందించి ఆపరేటర్, సిస్టమ్స్ ఏర్పాటు చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.