Rajarshi Shah:ఆదిలాబాద్ ఎంపీ బ‌రిలో 13 మంది

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
ఆదిలాబాద్ ఎంపీ బ‌రిలో 13 మంది
* 10 మంది అభ్య‌ర్థుల నామినేష‌న్ ప‌త్రాలు రిజెక్ట్
* నామినేషన్ పత్రాలను ప‌రిశీలించిన క‌లెక్ట‌ర్‌ రాజర్షి షా

అదిలాబాద్ పార్లమెంటరీ నియోజక వర్గ ఎన్నికల్లో వివిధ పార్టీల అభ్యర్ధులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను సాధారణ పరిశీలకులు రాజేంద్ర విజయ్ తో కలిసి జిల్లా రిటర్నింగ్ అధికారి రాజర్షి షా శుక్రవారం పరిశీలించారు.ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి మట్లాడుతూ 23 మంది అభ్యర్థుల్లో 13 అక్సెప్టెడ్. 10 రిజెక్ట్. అయ్యాయని తెలిపారు.42 సెట్స్ లో 27 ఆక్సెప్టెడ్, 15 రిజెక్టెడ్ అయ్యాయ‌ని తెలిపారు. బ‌రిలో ఉన్న‌వారు మాలోతు శ్యామ్‌లాల్ నాయక్ (అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ), రాథోడ్ సుబాష్ (ఇండిపెండెంట్), ఆత్రం సుగుణ (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్), మెస్రం గంగా దేవి (ధర్మ సమాజ్ పార్టీ), ఆత్రం సక్కు (భారత రాష్ట్ర సమితి), గెడం సాగర్ (ఇండియా ప్రజాబంధు పార్టీ), గోడం నగేష్ (భారతీయ జనతా పార్టీ, కొడప వామన్ రావు (గొండ్వానా దండకారణ్య పార్టీ), భుక్యా జైవంత్ రావు (స్వతంత్ర అభ్యర్థి) , నునావత్ తిరుపతి( విద్యార్థుల రాజకీయ పార్టీ), రాథోడ్ రాజు( స్వతంత్ర అభ్యర్ధి), చవాన్ సుదర్శన్, (అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ), జంగు బాపూ మెస్రం ( బహుజన్ సమాజ్ పార్టీ), రిజెక్ట్ వారు… చవాన్ రామ్ (ఇండిపెండెంట్), రాథోడ్ రమేష్ ( భారతీయ జనతా పార్టీ ), నేతావత్ రాందాస్ (ఇండిపెండెంట్), కుమారం మంతయ్య (ఇండిపెండెంట్ ), పెందూరు సుధాకర్ (ఇండిపెండెంట్), ధరావత్ నరేంధర్ (బీఆర్ ఎస్‌),ఆత్రం భాస్కర్ (ఐఎన్‌సీ), నైతం రవీందర్ (ఇండిపెండెంట్), మడావి వెంకట్ రావు ( రాష్ట్రీయ మానవ్ పార్టీ), ఆత్రం భీమ్ రావు (ఇండిపెండెంట్) ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *