సిరా న్యూస్, బోథ్
హోమ్ ఓటింగ్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీలు
ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ పరిధిలోని పాట్నాపూర్ గ్రామంలో శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షాతో పాటు జిల్లా ఎస్పీ గౌస్ అలంలు హోమ్ ఓటింగ్ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ఈసందర్భంగా వారు మాట్లాడుతూ 85 సంవత్సరాలు దాటిన వారికి ఎలక్షన్ కమిషన్ ఇంటి వద్దనే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించిందని తెలిపారు. వీరి వెంట తహసీల్దార్ సుభాష్ చంద్ర , స్థానిక పోలీస్ అధికారులు ఎస్సై బి రాము, సిఐ రమేష్ లు ఉన్నారు