సిరాన్యూస్, ఆదిలాబాద్
ధరణి, ప్రజావాణి పెండింగ్ సమస్యలు పరష్కరించాలి: కలెక్టర్ రాజర్షి షా
పెండింగ్ లో ఉన్న ధరణి, ప్రజావాణి దరఖాస్తులను వారం లోగా పరిశీలించి పరిష్కరించాలని ఆదిలాబాద్ జిల్లా పాలనాధికారి రాజర్షి షా తహసీల్దార్ లను ఆదేశించారు. బుదవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరం లో రెవెన్యూ అధికారులతో జిల్లా కలెక్టర్ రాజర్షి షా ధరణి, ప్రజావాణి లో ఉన్న పెండింగ్ దరఖాస్తుల పై సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ధరణి పోర్టల్ పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వారం లోగా పెండింగ్ ఉన్న సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైతే ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి ఆన్లైన్ లోనే కాకుండా ఫైల్స్ రూపంలో కూడా నిర్వహించాలని తహసీల్దార్లను ఆదేశించారు. రిపోర్టులను పరిశీలించి సంబంధిత నివేదికలతో పూర్తిస్థాయిలో కలెక్టరేట్ కు సమర్పించాలని అన్నారు. ప్రత్యేక చర్యలు చేపట్టి పూర్తి చేయాలని అన్నారు. ఈ క్రమంలో మండలాల వారీగా తహసీల్దార్ లను వారి లాగిన్ లో ఉన్న పెండింగ్ దరఖాస్తుల పై సమీక్షించి త్వరగా పూర్తి చేయాలని, జూన్ రెండవ వారంలో ప్రజావాణి ప్రారంభం అవుతుందని ఆ లోపు ఇప్పటి వరకు ఉన్న అన్ని రకాల పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని ఆదేశించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామల దేవి, ఆర్డీఓ వినోద్, జివాకర్ రెడ్డి, తహసీల్దార్లు, సర్వేయర్లు, తదితరులు పాల్గొన్నారు.