సిరాన్యూస్, ఆదిలాబాద్
లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ: కలెక్టర్ రాజర్షి షా
లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ జూన్ 4 న నిర్వహించనున్న సందర్భంగా మంగళవారం కలెక్టరేట్ సమావేశం మందిరం లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ సిబ్బంది శిక్షణ లో రిటర్నింగ్ అధికారి రాజర్షి షా పాల్గొని పలు అంశాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నకు సంబందించి సిబ్బందికి ట్రైనర్ లక్ష్మన్ ద్వారా శిక్షణను ఇప్పించారు.ఈ శిక్షణలో ప్రొజెక్టర్ ద్వారా అవగాహన కల్పించారు. రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ మరో వారం రోజులు మాత్రమే ఎన్నికల ఓట్ల లెక్కింపు నకు సంబందించి ఎన్నికల ఫలితాల సమయం ఉందని, అసెంబ్లీ స్థానాల వారిగా పోలైన ఓట్లు, మొత్తం పోలింగ్ బూత్ ల ఆధారంగా లెక్కింపు టేబుళ్లను సిద్ధం చేయడం జరుగుతుందని తెలిపారు. జూన్ 4 న ఉదయం 8.00 గంటల నుండి పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం ల ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందని, వేరువేరుగా టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మొత్తం పూర్తి స్థాయి ఫలితాల వెల్లడికి మధ్యాహ్నం 3.00 గంటల వరకు సమయం పట్టనుందని , కౌంటింగ్ ప్రక్రియ లో ఎన్నికల పరిశీలకులు, సహాయ రిటర్నింగ్ అధికారి, సూపర్ వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్స్, మైక్రో అబ్జర్వర్స్, వీరితో పాటు వివిధ పార్టీల ఎన్నికల ఏజెంట్లు ఉంటారని అన్నారు.ఈ క్రమంలో ఓట్ల లెక్కింపు రోజు విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ, కౌంటింగ్ ప్రక్రియ ను ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పారదర్శకంగా పూర్తి చేయాలని ఆదేశించారు .
శిక్షణలో పూర్తి అవగాహన కల్పించుకోవాలని, తెలియని విషయాలు తెలుసుకోవాలని అన్నారు.ఈ శిక్షణలో సహాయ రిటర్నింగ్ అధికారి ఖుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్ శ్యామలా దేవి, ఆర్డీఓ వినోద్, తదితరులు పాల్గొన్నారు.