Rajarshi Shah: మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ల పై ఇంటింటా సర్వే: క‌లెక్ట‌ర్ రాజర్షి షా

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ల పై ఇంటింటా సర్వే: క‌లెక్ట‌ర్ రాజర్షి షా

జిల్లాలోని మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ల పై ఇంటింటా సర్వే నిర్వహించాలని జిల్లా పాలనాధికారి రాజర్షి షా అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మొబైల్ అప్లికేషన్ శిక్షణా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా నుండి మొబైల్ అప్లికేషన్ పై హైదారాబాద్ లో శిక్షణ పొందిన మాష్టర్ ట్రైనర్ల చే ప్రొజెక్టర్ ద్వారా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మొబైల్ అప్లికేషన్ పై వివరించారు. అనంతరం జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ జలజీవన్ మిషన్ ద్వారా సర్వే నిర్వహించడం జరుగుతుందని, ఆయా గ్రామాలలోఎంపీడీఓలు ఏపిఓలు, ఏపిఎం లు టెక్నికల్ అసిస్టెంట్లు, పంచాయితీ సెక్రటరీ లు,ఈజీఎస్‌, సీసీఐకేపీ లను సర్వే అధికారులుగా నియమించడం జరిగిందని ఆన్నారు.జిల్లా మొత్తం 847 మంది సిబ్బంది కి శిక్షణ ఇచ్చామని జీపీలు 468, ఇళ్లు 1, 47, 894.ఈ సర్వే ద్వారా జిల్లాలో మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు ఎన్ని, నీరు వస్తుందా? లేదా అనే వివరాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని, సిబ్బంది ప్రతి ఇంటింటికి వెళ్లి నల్లా కనెక్షన్లు చెక్ చేసి కుటుంబ సభ్యుల వివరాలు మొబైల్ యాప్ లో నమోదు చేయాలని ఆన్నారు.ప్రతీ ఆపరేటర్ రోజుకు 35 వరకు అప్లికేషన్లు 10 రోజుల్లో పూర్తి చేయాలని, ఈ సర్వే అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు.ఈ శిక్షణ లో డీపీఓ శ్రీలత, ఎస్ఈ ఎండి సురేష్, ఈఈ చంద్ర మోహన్, డీఎల్‌పీఓ ఫణీంద్ర, జీవన్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *