Rajarshi Shah: క‌లెక్ట‌ర్ రాజర్షి షాను స‌న్మానించిన అధికారులు

సిరాన్యూస్, ఆదిలాబాద్
క‌లెక్ట‌ర్ రాజర్షి షాను స‌న్మానించిన అధికారులు

2024 లోక్ సభ సాధారణ ఎన్నికల ను అదిలాబాద్ జిల్లాలో నోటిఫికేషన్ వెలువడినప్పటి నుండి కౌంటింగ్ వరకు తనదైన శైలిలో ప్రతి అంశం లో చురుకైన పాత్ర వహించి ఎలాంటి సంఘటనలకు తావివ్వకుండా విజయవంతంగా పూర్తి చేసినందుకు జిల్లా పాలనాధికారి రాజర్షి షా కు భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సర్టిఫికెట్ అంద‌జేసింది. సందర్భంగా శనివారం తన ఛాంబర్ లో జిల్లా పాలనాధికారిని జిల్లా రెవెన్యూ సిబ్బంది , జిల్లా పౌర సంబంధాల అధికారి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు, అధికారులు ప్రజప్రతినిధులు, మీడియా సహాయ సహకారాలు, సమిష్టి కృషి వల్లే ఎన్నికలను దిగ్విజయంగా పారదర్శంగా నిర్వహించామని అన్నారు. మనందరం ఇదే సమిష్టి కృషి సమన్వయంతో జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేసి జిల్లాను అభివృద్ధిలో రోల్ మోడల్ గా నిలిపేందుకు కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డీపీఆర్ఓ తిరుమల, ఏఓ అరవింద్, ఎన్నికల సూప‌రింటెండెంట్ నలందా, తహసీల్దార్ రాజేశ్వర్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *