Rajarshi Shah:వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు

సిరా న్యూస్,ఆదిలాబాద్‌
వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు
* జిల్లా పాలనాధికారి రాజర్షి షా
మిషన్ భగీరథ ద్వారా వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టాలని , అందుకు సంబంధించిన పనులు సత్వరమే ప్రారంభించాలని జిల్లా పాలనాధికారి రాజర్షి షా అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బుధ‌వారం జిల్లా పాలనాధికారి సమావేశం మందిరం లో ప్రజాపాలన కార్యక్రమం లో భాగంగా ప్రజాపాలన సేవాకెంద్రాలు , నిర్వహణ పై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎం.పీ.డీ.ఓ, మున్సిపాలిటీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవ కేంద్రాలలో ప్రజలు ప్రజాపాలన కు సంబందించిన దరఖాస్తులను సంబంధిత అధికారులు స్వీకరించి డాటాను సక్రమంగా తప్పులు లేకుండా ఎంట్రీ చేయాలని తెలిపారు. ప్రజాపాలన సేవా కేంద్రాల్లో తగినన్ని దరఖాస్తు చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు కల్పించాలని అన్నారు. ఇప్పటికే ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా పథకాల కోసం ప్రజల నుంచి తీసుకున్న దరఖాస్తుల వివరాలను ఆన్లైన్ లో నమోదు చేయడం జరిగిందని, ఏవైనా తప్పులు నమోదైతె సరిచేయాలని తెలిపారు. క్షేత్ర స్థాయిలో సిబ్బందికి ప్రజాపాలన సేవా కేంద్రాల పట్ల అవగాహన కల్పించాలన్నారు.ప్రత్యేక అధికారులను నియమించడం జరుగుతుందని వారు మండలాల్లో పర్యటించి పరిశీలించాలని ఆన్నారు.ఈ సమావేశం లో ఐటిడిఏ పిఓ ఖుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్ శ్యామలా దేవి, ట్రైనీ కలెక్టర్ వికాస్ మెహతో, తహసీల్దార్ ఎంపిడివో లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *