సిరాన్యూస్, ఆదిలాబాద్
ప్రతి ఒక్కరూ యోగా చేయాలి : కలెక్టర్ రాజర్షి షా
* యోగా చేసిన కలెక్టర్, ఎమ్మెల్యే పాయల్ శంకర్
ప్రతి ఒక్కరూ యోగా చేయాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు.శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక రెవెన్యూ గార్డెన్ లో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈసందర్బంగా యోగా కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి రాజర్షి షా, శాసన సభ్యులు పాయల్ శంకర్ పాల్గొని యోగా చేశారు.