Rajarshi Shah: అమృత్ పథకం ప‌నుల‌ను వేగ‌వంతం చేయండి : క‌లెక్ట‌ర్ రాజర్షి షా

సిరా న్యూస్,ఆదిలాబాద్‌
అమృత్ పథకం ప‌నుల‌ను వేగ‌వంతం చేయండి : క‌లెక్ట‌ర్ రాజర్షి షా

అమృత్ పథకం ప‌నుల‌ను వేగ‌వంతగా పూర్తి చేయాల‌ని ఆదిలాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ రాజర్షి షా అన్నారు. బుదవారం సాయంత్రం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని క‌లెక్టరేట్‌లో జిల్లా పాలనాధికారి రాజర్షి షా తన ఛాంబర్ లో అమృత్ పథకం పై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా క‌లెక్ట‌ర్‌ మాట్లాడుతూ అమృత్ పథకం ఆదిలాబాద్ టౌన్ కి మంజూరైన సందర్భంగా 11 జోన్ ల లో పైప్ లైన్ , నల్లా కనెక్షన్ల పనులు పూర్తయ్యాయని, భాగ్య నగర్, కుర్షీద్ నగర్, రణదీవ్ నగర్, ఖానాపూర్, ఓల్డ్ హౌసింగ్ బోర్డు ఈ 5 జోన్ లలో వాటర్ సప్లై రెగ్యులరైజ్ చేయబడిందని తెలిపారు. మిగతా 6 జోన్ లు అయిన మహాలక్ష్మి వాడ, ఫిల్టర్ బెడ్ ఏరియా, తిర్పెల్లి 1, తిర్పెల్లి 2, వినాయక్ చౌక్, శాంతి నగర్ లలో పైప్ లైన్ కమీషనింగ్ రెగ్యులరైజేషన్ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.వాటర్ గ్రిడ్ నుండి టౌన్ డిమాండ్ కి సరిపడా నీరు అందించకపోవడం వలన పైప్ లైన్ రెగ్యులరైజేషన్ పనులు పెండింగ్ లో ఉన్నాయని ఈఈ తెలపగా వాటర్ గ్రిడ్ అధికారులు టౌన్ డిమాండ్ కి సరిపడా నీరు అందిస్తామని ఆన్నారు . తద్వారా వచ్చే నీటి తో టౌన్ లో పెండింగ్ లో ఉన్న 6 జోన్ లలో కూడా కమీషనింగ్ పనులు వేగవంతం చేయడానికి అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.ఈ సమావేశం లో పబ్లిక్ హెల్త్ ఈ ఈ గంగాధర్, డి.ఈ.ఈ సంతోష్, మున్సిపల్ కమిషనర్ ఖమ్మర్ అహ్మద్, ఈ ఈ తిరుపతి, ఏజెన్సీ లు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *