Rajarshi Shah: తరగతి గదులలో వర్షం నీరు రాకుండా చూడాలి: క‌లెక్ట‌ర్ రాజర్షి షా

సిరాన్యూస్‌,ఆదిలాబాద్‌
తరగతి గదులలో వర్షం నీరు రాకుండా చూడాలి: క‌లెక్ట‌ర్ రాజర్షి షా

తరగతి గదులలో వర్షం నీరు రాకుండా చూడాల‌ని ఆదిలాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ రాజర్షి షా అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లూరు, కోలిపుర ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల, ప్రాధమిక ఉన్నత పాఠశాల లను జిల్లా పాలనాధికారి రాజర్షి షా సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా బెల్లురు, కొలిపుర లోని ప్రాధమిక పాఠశాల, ప్రాథమిక ఉన్నత పాఠశాలల ను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసి మొక్కలు నాటి అమ్మా ఆదర్శ పాఠశాల కమిటీ ద్వార చేపడుతున్న నిర్మాణ పనుల తీరును, విద్యార్ధుల ఏకరూప దుస్తుల ఏర్పాటు పై ఆరా తీశారు. విద్యార్ధులతో ముచ్చటిస్తూ టెస్ట్ బుక్ లోని పాఠాలను చదివించారు. మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచాలని, తరగతి గదులలో వర్షం నీరు రాకుండా చూడాలని, ఎక్కడైనా వర్షం నీరు తరగతి గదులలో కురుస్తే తక్షణ చర్యలు చేపట్టాలని ఆన్నారు. వివిధ సమస్యలను కాలనీ వాసులు జిల్లా పాలనాధికారికి విన్నవించగా , సమస్యల పై పూర్తి వివరాలు సేకరించి రిపోర్టు సమర్పించాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఈఓ ప్రణీత, మున్సిపల్ కమిషనర్, ప్రిన్సిపల్స్ నారాయణ, జయ, తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *