Rajarshi Shah: ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

సిరా న్యూస్,ఆదిలాబాద్‌
ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
* జిల్లా కలెక్టర్ రాజర్షి షా
* పరీక్ష కేంద్రాల ఆకస్మిక తనిఖీ
ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని నలంద డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన ఇంటర్ పరీక్ష కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. అవసరమైన అన్ని రకాల వస్తువులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *