సిరాన్యూస్, ఆదిలాబాద్
అర్జీలను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్ రాజర్షి షా
* లబ్దిదారుల నుంచి అర్జీలను స్వీకరించిన అధికారులు
అర్జీదారులు అందజేసిన అర్జీలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా పాలనాధికారి రాజర్షి షా అన్నారు. ప్రజావాణి సందర్భంగా సోమవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరం లో జిల్లా పాలనాధికారి రాజర్షి షా, అదనపు కలెక్టర్ శ్యామల దేవి తో కలసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి వివిధ మండలాల నుండి వచ్చిన అర్జీదారుల అర్జీలను స్వీకరించి పరిశీలించి సంబంధిత అధికారులను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.ప్రజావాణిలో మొత్తం వంద దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాల మేరకు ప్రత్యేక అధికారులు గా నియమించబడిన అధికారులు ఫీల్డ్ విసిట్ చేయాలని, రోజువారి నివేదిక టూర్ డైరీ మెయింటెన్ చెసి ప్రతీ నెల 5 లోగా రిపోర్ట్ సమర్పించాలని స్పష్టం చేశారు. వన మహోత్సవం సందర్భంగా ఆయా శాఖలకు కేటాయించిన లక్ష్యాలను సాధించాలని, ప్రతీ రోజూ నాటిన మొక్కల యెుక్క వివరాలను పోర్టల్ లో అప్ లోడ్ చేయాలనీ ఆన్నారు. అంతకుముందు గుడిహత్నూర్ మండలంలో పర్యటించి మన గ్రోమోర్ ఫర్టీలైజర్ షాప్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయాన్ని, గోదాముల ను ఆకస్మికంగా తనిఖీ చేసి రిజిష్టర్లు, నిలువ ఉన్న బ్యాగ్ లను క్షుణ్ణంగా పరిశీలించి, రోజువారి అమ్మకాల పై ఆరాతీశారు. అనంతరం ఎంపీడీఓకార్యాలయం ను ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రజాపాలన సేవా కేంద్రాన్ని పరిశీలించారు. ప్రజా పాలన సేవా కేంద్రం ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు ఉంటుందని అధికారులు సమయపాలన పాటించాలని, ప్రజాపాలన బ్యానర్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా అధికారులు, ఎంఆర్ఓ కవిత రెడ్డి, ఎంపిడిఓ, డీఈఓ పుల్లయ్య, డీసీఓ మోహన్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.