సిరాన్యూస్, ఆదిలాబాద్
రైతులకు ఇబ్బంది కలిగించవద్దు: కలెక్టర్ రాజర్షి షా
* రైతు రుణమాఫీపై అధికారులతో సమావేశం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు రుణ మాఫీ కీ సంబంధించి గైడ్ లైన్స్ ప్రకారం జమ అయ్యే ఋణం రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగ కుండ నేరుగా రైతులకు చేరేలా బ్యాంకర్లు, వ్యవసాయ విస్తరణ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా పాలనాధికారి రాజర్షి షా అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాంకర్లతో సమావేశం గూగుల్ మీట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రైతు రుణమాఫీ 2024 1 లక్ష లోపు పంట రుణాలు పొందిన 18, 739 మంది రైతులకు సంబంధించిన పంట రుణాలు మాఫీ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం అందజేస్తున్న 1 లక్ష రూపాయల లోపు లోన్ తీసుకున్న రెైతులు ఋణ మాఫీ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారి ఖాతాలో జమ అయిన రుణమాఫీ రూపాయలను నేరుగా రైతులకే అందేటట్లు చూడాలన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రతి రైతు వేదికలో రైతుల యొక్క లిస్టు డిస్ప్లే చేయాలన్నారు. రైతులకు సంబంధించిన అదార్ కార్డు , పాస్ పుస్తకం తదితర డాకుమెంట్స్ తీసుకొని రెనివల్ కోసం బ్యాంకు కు రావాల్సి ఉంటుందని తెలిపారు.ఈ రుణమాఫీ 12.12.2023 నుండి 09.12.2023 ఈ మధ్య కాలంలో తీసుకున్న రైతులకు వర్తిస్తుందని తెలిపారు. ప్రతి గ్రామాపంచాయతి లో రైతులకు సంబంధించి వివరాలతో కూడిన బ్యానర్లు ఏర్పాటు చేయాలనీ , వ్యవసాయ విస్తరణ అధికారులు అందుబాటులో ఉండి రైతు రుణమాఫీ రైతులకు చేరేలా చూడాలన్నారు. బ్యాంకు ల వద్ద రైతులు ఆందోళనకు గురికాకుండా క్రమశిక్షణ పాటించడం కోసం పోలిస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని రైతులు ఇబ్బంది పడకుండా క్రాప్ లోన్ రినివల్ చేసుకునేందుకు బ్యాంకు అధికారులు సహకరించాలని సూచించారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు బ్యాంకు అధికారులకు సహకారం అందించాలని, ఎలాంటి సమస్యలు ఎదురైన తమ దృష్టి కి తీసుకురావాలని సూచించారు. అందరి సహాయ సహకారాలతో లక్ష రైతు రుణమాఫీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈసమావేశం లో వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య, లీడ్ బ్యాంక్ మేనేజర్, ఎస్ బి ఐ రిజినల్ మేనేజర్ , యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , తెలంగాణా గ్రామీణ బ్యాంకు, కో ఆపరేటివ్ బ్యాంకు, ఇతర బ్యాంకుల అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.