సిరాన్యూస్, ఆదిలాబాద్
తల్లిపాల వారోత్సవ కార్యక్రమాలను విజయవంతం చేయాలి: కలెక్టర్ రాజర్షి షా
* తల్లిపాల వారోత్సవ కార్యక్రమాల పోస్టర్ ఆవిష్కరణ
ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఈనెల 1 నుండి 7 వ తేదీ వరకు నిర్వహించే కార్యక్రమాలను విజయవంతం చేయాలని
జిల్లా పాలనాధికారి రాజర్షి షా అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమం సందర్భంగా శుక్రవారం జిల్లా పాలనాధికారి రాజర్షి షా తన ఛాంబర్ లో పోస్టర్ లను ఆవిష్కరించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి, ఎసీడీపీవో , సీడీపీఓ లు , వైద్య శాఖ అధికారులతో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల నిర్వహణ పై జిల్లా పాలనాధికారి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతరాలను తొలగించి తల్లి ప్రాముఖ్యతను చాటుదాం” అనే థీమ్ తో ప్రతి అంగన్వాడి సెంటర్ల పరిధిలో, సబ్ సెంటర్స్, పీహెచ్సీ, సీహెచ్సీ , ఏరియా, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రు లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు . ఈ కార్యక్రమాలు జిల్లా పంచాయితీ కార్యాలయం, డీఆర్డీఏ మెహ్మ, ఆరోగ్య శాఖ సిబ్బంది, పత్రిక, డిటల్ మీడియా, సోషల్ మీడియా సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ జిల్లా లో ప్రసవాలు వంద శాతం ఆసుపత్రులలో జరిగేలా చూడాలన్నారు.. తల్లిపాల యొక్క ప్రాముఖ్యతను, ముర్రుపాల యొక్క ప్రాముఖ్యతను గురించి ప్రత్యేక దృష్టి సారించాలని, దీని పై ఎక్కువ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు . ప్రణాళిక ప్రకారం సామజిక వేడుకలు ,ఆసుపత్రుల సందర్శన , గృహ సందర్శన లు, ఎస్హెచ్జీ మీటింగ్స్, నిర్వహించాలని, దీనిలో భాగంగా 7 నెలలనుండి 2 సం,ల పిల్లలకి , బాలామృతం , బాలామృతం ప్లస్ పై అవగాహన కల్పించాలని అన్నారు .ఈ ఏడు రోజుల కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ అభిగ్యాన్ మాలవియా, జిల్లా శిశు సంక్షేమాధికారి సబితా, ఏసీడీపీఓ మిల్కా , సి డి పి ఓ లు సంబంధిత అధికారులు ,తదితరులు పాల్గొన్నారు .