Rajender Hapawat: విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలి:  రైతు నేత రాజేందర్ హపావత్

సిరాన్యూస్‌, ఖానాపూర్ టౌన్
విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలి:  రైతు నేత రాజేందర్ హపావత్

రైతుల‌కు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని సదర్ మాట్ కాలువ సాధన సమితి అధ్యక్షులు, రైతు నేత రాజేందర్ హపావత్ కోరారు. బుధ‌వారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో హబవత్ రాజేందర్ మాట్లాడారు. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని కోరారు. రైతులకు ఇబ్బందులు కలిగించకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో రైతులపై జరిగిన ఘటనను ఖండించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఖానాపూర్ నియోజకవర్గంలో కొన్ని మండలాల్లో పత్తి, సోయ, వరి, మొక్క జొన్నతో పాటు వాణిజ్య పంటలు కూడా పండిస్తారని చెప్పారు. ఏ‌ రైతు కూడా విత్తనాలు, ఎరువుల కొరత‌తో బాధకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *