సిరాన్యూస్, ఆదిలాబాద్
మైక్రో అబ్జర్వర్స్ ర్యాండమైజేషన్
లోక్ సభ ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్ నియోజక వర్గాల వారిగా మైక్రో అబ్జర్వర్స్ ర్యాండమైజేషన్ ను సాదారణ పరిశీలకులు రాజేంద్ర విజయ్, జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజర్షి షా ఆధ్వర్యంలో కేటాయించారు. జిల్లా కలెక్టరేట్ ఎన్ ఐసీ సమావేశం మందిరంలో సోమవారం మైక్రో అబ్జర్వర్స్ ర్యాండమైజేషన్ నిర్వహించారు. ఆదిలాబాద్ పార్లమెంటరీ సెగ్మేంట్ల వారిగా అదిలాబాద్ 14, బోథ్ 30, ఆసిఫాబాద్ 24, సిర్పూర్ 16, నిర్మల్, 30, ఖానాపూర్ 49, ముదోల్ 27 మొత్తం 190 మైక్రో అబ్సర్వర్స్,(యాదృచ్ఛికరణ) ద్వారా కేటాయించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామల దేవి, అదిలాబాద్, నిర్మల్, కొమురం భీమ్ ఈడీఎంలు, జిల్లా విద్యా శాఖ అధికారులు, కలెక్టరేట్ ఎన్నికల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.