సిరాన్యూస్, బోథ్
ఎకరానికి 20 క్వింటాళ్ల జొన్న పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలి
బీజేపీ ఓబీసీ జిల్లా అధ్యక్షులు రాజు యాదవ్
* జొన్న పంట కొనుగోళ్ల పరిశీలన
రైతులు పండించిన జొన్న పంటను ప్రభుత్వం ఎకరానికి 20 క్వింటాల వరకు కొనుగోలు చేయాలని బీజేపీ ఓబీసీ జిల్లా అధ్యక్షులు రాజు యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మార్కెట్ యార్డ్ లో కొనుగోళ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతుల వద్ద ఎకరానికి 13 క్వింటాళ్ల మేరకు కొనుగోలు చేయడం జరిగిందని, కేవలం 8 క్వింటాల 85 కిలోలు కొనుగోలు చేస్తామని పేర్కొనడం సరైన పద్ధతి కాదన్నారు. ఈ ఏడాది ఎకరానికి 20 క్వింటాళ్ల మేరకు దిగుబడి వచ్చిందని, రైతులు పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో అధికారులు పునరాలోచించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అనిల్ అప్ప సంజీవ్, కనుగుట్ట గ్రామ రైతులు భీమ్రావు, సోనాల రైతు రవీందర్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి లతోపాటు పలువురు రైతులు పాల్గొన్నారు .