Raju Yadav: మోడీ పేరు చెప్పి ఓట్లు అడుగుతున్న నాయకులు

సిరాన్యూస్, బోథ్‌
మోడీ పేరు చెప్పి ఓట్లు అడుగుతున్న నాయకులు
సహకార సంఘం డైరెక్టర్ జి రాజు యాదవ్

భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు సహకార సంఘం డైరెక్టర్ జి రాజు యాదవ్ విమర్శించారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్‌ మండల కేంద్రం సమీపంలోని పలువురి చేలలో పనులు చేస్తున్న ఉపాధి హామీ కూలీల దగ్గరికి వెళ్లి పార్టీ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి ప్రజాబలం లేక ప్రధానమంత్రి పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. గతంలో ఆయన నియోజకవర్గానికి ఎంపీగా చేసిన అభివృద్ధి ఏమిటని ఆయన ప్రశ్నించారు .పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం ఖాయమని పేర్కొన్నారు. ప్రచార కార్య‌క్ర‌మంలో ఏఎంసీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, ఎంపీటీసీ, సీనియర్ నాయకులు మహేందర్, షేక్ అబూద్, భోజన ఉమేష్, సురేందర్, యూసుఫ్, రాము రహీం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *