సిరాన్యూస్, ఖానాపూర్
బోరు మోటర్కు మరమ్మతులు చేయించిన మున్సిపల్ చైర్మన్ రాజుల సత్యం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణం శాంతి నగర్ కాలనీలోని శ్రీ ముత్యాల పోచమ్మ అమ్మవారి ఆలయంలో మూడు రోజులుగా బోరు మోటర్ పాడైపోయింది. దీంతో తాగునీరు లేక భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. ఈవిషయం వైస్ చైర్మన్ కావలి సంతోష్, భక్తులు గురువారం ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం కు తెలియజేశారు. వెంటనే స్పందించిన చైర్మన్ బోరు మోటరుకు మున్సిపాలిటీ వాటర్ సప్లై సిబ్బంది తో మరమ్మతులు చేయించి తాగునీటిని అందించారు. కార్యక్రమంలో కావలి సంతోష్, కాలనీవాసులు సిరిగరపు లింగన్న , తదితరులు పాల్గొన్నారు.