Rajula Satyam:ప్రభుత్వ నిబంధనల‌ను వ్యతిరేకిస్తే చట్టబద్ధంగా చర్యలు: మున్సిపల్ చైర్మన్ రాజుల సత్యం 

సిరాన్యూస్‌, ఖానాపూర్‌టౌన్‌
ప్రభుత్వ నిబంధనల‌ను వ్యతిరేకిస్తే చట్టబద్ధంగా చర్యలు: మున్సిపల్ చైర్మన్ రాజుల సత్యం 

ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అనుమతి లేని వెంచర్లు వేస్తూ కాంప్లెక్స్ లు ఇండ్లు కట్టిన వారు ఎంతటి వారైనా సహించేది లేదని, చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటామ‌ని, నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో మున్సిపల్ చైర్మన్ రాజుల సత్యం అన్నారు. శ‌నివారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయ‌న మాట్లాడారు.కొందరు కావాలని ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేని వెంచర్లు వేస్తూ అనుమతి లేని ఇండ్లు కడుతున్నారని, దీని పై యధావిధిగా మున్సిపల్ అధికారులు ప్రభుత్వ అనుమతులు కోరడం జరుగుతుంద‌ని, దీన్ని సాకుగా చేసుకొని మున్సిపల్ అధికారులు మున్సిపల్ ప్రజా ప్రతినిధులను అభాసు పాలు చేసేందుకు కుట్ర పూరితంగా వారి వద్ద అనుమతులు లేని విషయాన్ని కప్పి పుచ్చుకోవడానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని తెలిపారు. డిటిసిపి అనుమతి లేని వెంచర్లు వేసి ప్లాట్లు అమ్మిన కొందరు రియల్టర్లు ఊర్లో పెద్ద మనుషులు గా చలామణి అవుతున్న కొందరు పెద్ద మనుషులు పాలక వర్గం పై అసత్యపు ప్రచారాలు చేస్తున్నార‌ని,దీని వెనుక ఎవరూ ఉండి నడిపిస్తున్నారో మాకు బాగా తెలుసు. ఖానాపూర్ ప్రజలు ఇలాంటి వారి మాటలకు అయోమయానికి గురి కావాల్సిన అవసరం లేదు, అతి త్వరలో అక్రమ కట్టడందారులు అక్రమ వెంచర్ల భాగోతం బయట పెడతామ‌ని తెలిపారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే ప్రయత్నం చేస్తున్న వారి వలన ఖానాపూర్ పట్టణం లో 11వ వార్డు లో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వెంచర్ లు వేసి ప్లాట్లు వేసి అమ్మడం వలన ఇటివల కురిసిన భారీ వర్షాలకు అయ్యప్ప గుడి ముందర ఇండ్లలోకి భారీగా వర్షపు నీరు రావడానికి కారణం అయింద‌న్నారు.ఎవరైనా ఎంతటి వారైనా నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు వెంచర్లు వేసిన ఇండ్లు కట్టిన నోటీసులు జారీ చేసి చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటాం తాటాకు చప్పుళ్లకు భయపడే వాళ్ళం కాదన్నారు.ఈ స‌మావేశంలో వైస్ చైర్మన్ కావలి సంతోష్,కౌన్సిలర్ కిషోర్ నాయక్ కుర్మా శ్రీను,నాయకులు జన్నారపు శంకర్, పరిమి సురేష్,అమనుల్లా ఖాన్,షబ్బీర్ పాషా లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *