సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో బుధవారం శ్రీ రామనవమి సందర్భంగా ఖానాపూర్ పట్టణం శ్రీ రామ్ నగర్ కాలనీలోనీ శ్రీ సీతా రాముల ఆలయంలో స్వామివారిని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం దర్శించుకుని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఆలయ కమిటీ తరఫున సీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ ను, కౌన్సిలర్లను ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. వారి వెంట కౌన్సిలర్ నాయకులు జన్నరపు శంకర్ , నాయిని సంతోష్ , ఆలయ కమిటీ సభ్యులు,కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.