rajura Satyam: సుగుణ‌క్క భారీ మెజార్టీతో గెలిపించాలి: మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం

సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
సుగుణ‌క్క భారీ మెజార్టీతో గెలిపించాలి: మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం

సుగుణ‌క్క భారీ మెజార్టీతో గెలిపించాలని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం అన్నారు. మంగ‌ళ‌వారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని విద్యానగర్ కాలనీ 11వ వార్డులో ఎంపీ అభ్యర్థి సుగుణక్క గెలుపే లక్ష్యంగా మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం ఇంటింటికి వెళ్లి ప్రజలకు గ్యారంటీ కార్డుల పైన అవగాహన క‌ల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చుకునే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీనేనని తెలిపారు. ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ సహాయ సహకారాలతో ఖానాపూర్ పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఎంపీగా సుగుణక్కను గెలిపించాలని అన్నారు.కార్యక్రమంలో 233 బూత్ ఇంచార్జ్ కంఠం రవి , నాయకులు వేణు, నరేందర్, సాయి రాం, రోహిదాస్, తిలక్ రావు , రవి తేజ, త్రివేణి, బి ,రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *