సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
కోతుల దాడిలో గాయపడిన కుటుంబాన్ని పరామర్శించిన మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణం విద్యానగర్ కాలానికి చెందిన అలగుంట శంకర్ స్వాతి మేనల్లుడు కోతుల దాడిలో గాయపడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు ప్రభుత్వ దవాఖానకు తీసుకువెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం దవాఖానకు వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్ , నాయకులు రోహి దాస్ తదితరులు పాల్గొన్నారు.