Rajura Satyam: చ‌లివేంద్రాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం

సిరా న్యూస్,ఖానాపూర్‌
చ‌లివేంద్రాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని సత్తన పల్లి గ్రామంలో క్రీ శే. సీతారాం నాయక్, క్రీ శే. ఖనిరం నాయక్ జ్ఞాపకార్థం బుధవారం సత్తాన పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన చ‌లివేంద్రాన్ని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండాకాలంను దృష్టిలో ఉంచుకుని ప్రజలు రద్దీగా ఉండే ప్రదేశంలో ప్రజలకు అందుబాటులో చలివేంద్రం ఏర్పాటు చేశారని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మోహిద్ , మండల అధ్యక్షులు దొనికేనీ దయానంద్ , పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్ , మాజీ సర్పంచ్ సీర్ల విజయ్ , నాయకులు గుగ్లవత్ ఇబ్రం రీటైడ్ ఆర్టీసీ డ్రైవర్, లక్ష్మి పతి , గ్రామస్తులు ధమేర బక్కన, గుమ్ములా రమేష్, బర్కురి గంగ రెడ్డి, అడ్పు దేవన్న, మళవత్ రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *