సిరా న్యూస్, ఖానాపూర్ టౌన్
ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపిద్దాం : మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
కాంగ్రెస్ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపిద్దామని మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని 7వ వార్డు బుడగ జంగం కాలనీవాసులు, కుల సంఘం సభ్యులతో స్థానిక కౌన్సిలర్ కిషోర్ నాయక్ , పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం హాజరై మాట్లాడారు. ఎంపీ అభ్యర్థి అత్రం సుగుణక్క ని కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన గ్యారంటీల గురించి బుడగ జంగ సంఘం సభ్యులకు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అత్రం సుగుణక్క కి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండే ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు . కార్యక్రమంలో నాయకులు నయీమ్, జుని, మహేష్, బుడగ జంగం సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.