సిరాన్యూస్, ఖానాపూర్
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
* ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
* సీఎం సహాయ నిధి చెక్కు అందజేత
అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యంఅన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణం ఇంద్రనగర్ కాలనీకి చెందిన మేకల రవీందర్ కు సీఎం సహాయ నిధి కింద వచ్చిన చెక్కును బుధవారం ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మా బోజ్జు పటేల్ ఆదేశాల మేరకు క్యాంపు కార్యాలయంలో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం కుటుంబ సభ్యులకు అందజేశారు. వారి వెంట స్థానిక 5వ వార్డు కౌన్సిలర్ నాయకులు పరిమి లత సురేష్ , కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దొనికేని దయానంద్ , పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్ ,మండల జనరల్ సెక్రెటరీ షబ్బీర్ పాషా, మైనార్టీ మండలి అధ్యక్షులు సలీం ఖాన్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.