సిరాన్యూస్, ఖానాపూర్
కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలి: మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని 11వ వార్డులో మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం కార్యకర్తలు, నాయకులతో కలిసి ప్రచార కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణక్క గెలుపే లక్ష్యంగా ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఊరిలో వార్డులలో ప్రచార కార్యక్రమం నిర్వహించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని అన్నారు.కార్యక్రమంలో 233 బూత్ ఇంచార్జీలు కంఠం రవి, కమల్ రాజ్, నాయకులు కొండ నారాయణ, జక్కుల మహేందర్,రాజేశ్వర్, రోహిధస్, నరేందర్, వేణు, తదితరులు పాల్గొన్నారు