సిరాన్యూస్, ఖానాపూర్
ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపిద్దాం: ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపిద్దామని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం అన్నారు.నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని శుక్రవారం పలు వార్డులలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అత్రం సుగుణ గెలుపే లక్ష్యంగా వార్డు కౌన్సిలర్లు నాయకులు కిషోర్ నాయక్, పరిమి సురేష్,జన్నరపు శంకర్, మరియు శేషాద్రి, బక్క శెట్టి కిషోర్, సౌఖత్ పాషా ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం , పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్ పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక వార్డులు ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్యారంటీ ల గురించి ప్రజలకు తెలియజేశారు. ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిపించాలని అన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ కావలి సంతోష్ , నాయకులు మడిగేల గంగాధర్, నహీం, కడార్ల గంగ నరసయ్య,జహీర్, రాజేశ్వర్, నేరెళ్ల నారాయణ, రాజేందర్, బొప్పరపు శ్రీనివాస్, లక్ష్మణ్, రాము, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.