సిరాన్యూస్,ఖానాపూర్
ఖానాపూర్ 11వ వార్డులో మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని 11వ వార్డులో శనివారం ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణక్క ని భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. కార్యక్రమంలో 233 బూత్ కమిటీ ఇంచార్జీ కమల్ రాజ్, నాయకులు కొండ నారాయణ, మాడిగేల గంగాధర్, జక్కుల మహేందర్, బుషణి గంగాధర్, రాజ గౌడ్, రోహిధస్ నరేందర్,క్రాంతి, తదితరులు పాల్గొన్నారు.