సిరాన్యూస్,ఖానాపూర్ టౌన్
బండారి కిషోర్ దంపతులను పరామర్శించిన మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణానికి చెందిన మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యులు బండారి కిషోర్ దంపతులు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం మంగళవారం పద్మావతి నగర్ కాలనీలో ఉన్న వారి నివాస గృహానికి వెళ్లి వారిని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ నాయకులు పరిమి లత సురేష్ , యూత్ సభ్యులు రవి, సతీష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.