సిరాన్యూస్, ఖానాపూర్
తాత్కాలిక డ్రైనేజీ ఏర్పాటు చేస్తాం : మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
డ్రైనేజీ నీరు పంట పొలాల్లోకి రాకుండా తాత్కాలిక డ్రైనేజీ ఏర్పాటు చేస్తామని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణం శ్రీరామ్ నగర్ కాలనిలోనీ డ్రైనేజీ నీరు పంట పొలాల్లోకి వస్తున్నాయని బుధవారం శ్రీరామ్ నగర్ కాలనీ రైతులు మున్సిపాలిటీ కార్యాలయానికి తరలివచ్చారు. ఈసందర్భంగా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం కు సమస్యను వివరించారు. వెంటనే రైతులతో కలసి పంట పొలాల్లోకి వెళ్లి డ్రైనేజీ నీరు వస్తున్నా కాలువను మున్సిపల్ చైర్మన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట పొలాల్లోకి మురికి నీరు రాకుండా తాత్కాలిక డ్రైనేజీ ఏర్పాటు చేస్తామని, దాని కోసం రైతులు స్థలాన్ని చూపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కావలి సంతోష్ , కౌన్సిలర్ నాయకులు నాయిని సంతోష్ , మున్సిపల్ కమిషనర్ మనోహర్ , రైతులు తదితరులు పాల్గొన్నారు.