సిరాన్యూస్,ఖానాపూర్ టౌన్
పారిశుధ్య పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణం విద్యానగర్ కాలనీలోనీ ప్రధాన రహదారి పక్కన జరుగుతున్న పారిశుధ్య పనులను గురువారం ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తగా డ్రైనేజీలలో, రోడ్ల పక్కన వర్షపు నీరు నిలువకుండ పారిశుధ్య పనులను చేయిస్తున్నామని తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లేకుండా ఎల్లవేళలా ప్రజల కోసం పనిచేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటి అధికారులు మనల శంకర్ , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.