సిరా న్యూస్, ఖానాపూర్
మట్టి దుబ్బ తొలగింపు
* మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యంకు ప్రజల అభినందనలు
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ప్రధాన రహదారి మీద ఉన్న మట్టి దుబ్బ వల్ల ప్రజలు వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. స్పందించిన ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం గాలి పంపు మోటార్ల ద్వారా రోడ్డు మీదా నిలిచిన మట్టి దుబ్బను మున్సిపాలిటి సిబ్బంది చేత తొలగింప చేయించారు. సమస్యను పరిష్కరించిన మున్సిపల్ చైర్మన్ను ప్రజలు అభినందించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ నాయకులు జన్నరపు శంకర్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.