సిరాన్యూస్, ఖానాపూర్
విద్యుత్ సమస్యను పరిష్కరించిన మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని నెలకొన్న విద్యుత్ సమస్యను శుక్రవారం ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం పరిష్కరించారు. ఈసందర్బంగా మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం మాట్లాడుతూ నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ప్రధాన రహదారి మధ్యలో ఉన్నటువంటి సెంట్రల్ లైటింగ్ పోల్స్ కు గురువారం కురిసిన వర్షం కారణంగా సాయిబాబా ఆలయం నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందన్నారు. రాత్రి నుండి విద్యుత్ దీపాలు రాకపోవడంతో శుక్రవారం మున్సిపాలిటీ విద్యుత్ అధికారులతో కలిసి వెళ్లి సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కుర్మా శ్రీనివాస్ , మున్సిపల్ కమిషనర్ మనోహర్ , కరెంటు డిపార్ట్మెంట్ ఏ ఈ తుమ్ చరణ్, శివ, మున్సిపాలిటీ ఎలక్ట్రిషన్ సిబ్బంది ,కరెంట్ డిపార్ట్మెంట్, అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.